10, నవంబర్ 2011, గురువారం

భూమికి చేరువగా దూసుకువచ్చిన భారీ గ్రహశకలం

వాషింగ్టన్, నవంబర్ 9: నగరాల్లో ఓ పెద్ద ప్లాటంత గ్రహ శకలం ఒకటి బుధవారం తెల్లవారుజామున భూమికి దగ్గరగా దూసుకు పోయింది. ఇంత పెద్ద గ్రహ శకలం ఒకటి భూమివైపు దూసుకు రావడం గత 35 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2005 వైయు 55గా శాస్తజ్ఞ్రులు నామకరణం చేసిన 400 మీటర్ల వెడల్పు ఉండే ఈ గ్రహ శకలం భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భూమికి 2,01,700 మైళ్ల దగ్గరగా దూసుకువచ్చింది. అయితే ఆ వెంటనే గంటకు 46,700 కిలోమీటర్ల వేగంతో అది మళ్లీ విశ్వంలోకి వెళ్లిపోయింది. 1976 తర్వాత ఇంత పెద్ద గ్రహ శకలం భూమికి ఇంత దగ్గరికి ఎప్పుడూ రాలేదని, 2028 దాకా మళ్లీ రాబోదని నాసా అధికారులు చెప్తున్నారు. ఈ గ్రహ శకలం వాస్తవానికి భూమికి చంద్రుడికన్నా దగ్గరగా వచ్చినట్లు లెక్క. ఎందుకంటే చంద్రుడు భూమికి 2,38, 854 మైళ్ల దూరంలో ఉన్నాడు. అయితే ఈ గ్రహ శకలం ఇంత దగ్గరగా వచ్చినప్పటికీ అది భూమిని ఈ రోజు ఢీకొట్టే ప్రమాదం ఏమీ లేదని శాస్తజ్ఞ్రులు చెప్పారు. అయితే ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చే సమయం కోసం శాస్తజ్ఞ్రులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రహ శకలాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇది వారికి అరుదైన అవకాశాన్ని కల్పించింది.ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చే ముందు, అలాగే దూరంగా వెళ్లిపోయేటప్పుడు నాసా తీసిన ఫోటోలు, వీడియో చిత్రాలను బట్టి చూస్తే ఈ గ్రహ శకలం గుండ్రంగా ఉన్నప్పటికీ బోలుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని శాస్తజ్ఞ్రులు దీని సైజు, ఉపరితలం తీరు, పరిభ్రమించే సమయం, కక్ష్యలాంటి వాటి వివరాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసం పోర్టారికోలోని భారీ రేడియో టెలిస్కోప్‌తో పాటుగా కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్‌లో ఉన్న నాసాకు చెందిన విశ్వాంతరాళ పరిశోధనా కేంద్రం వద్ద పలు పరికరాలను దానిపైకి ఫోకస్ చేసారు. ప్రస్తుతం 2005వైయు 55 15 నెలలకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే కనీసం వచ్చే శతాబ్ది దాకా ఈ గ్రహ శకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఖగోళ శాస్తజ్ఞ్రులు ఇప్పటికే నిర్ధారించారు.