24, అక్టోబర్ 2011, సోమవారం

అమెరికాలో నలుగురు ఆంధ్రుల దుర్మరణం


తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆంధ్రులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మాజీ కౌన్సిలర్ జొన్నల రాజేంద్రప్రసాద్(46), ఆయన అల్లుడు వెంకటాచలం, అతడి స్నేహితులు ఆకుల సత్యేంద్ర, సుమంత్‌రాజన్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వీరు కారులో వెళ్తుండగా.. రాంగ్ రూట్‌లో అతి వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న కారు దగ్ధమైపోయింది.