ఐక్యరాజ్య సమితి : ఐక్యరాజ్య సమితిలో పాలస్తీ నియన్లకు పూర్తి సభ్యత్వానికి బదులు పరిశీలక హోదా లభించవచ్చని ఐక్యరాజ్య సమితిలో రష్యా ప్రతినిధి వితలీ చుర్కిన్ చెప్పారు. భద్రతా మండలిలో పాలస్తీనా గుర్తింపు నకు సంబంధించి జరిగే ఓటింగ్లో వీటో చేస్తామని అమెరికా ఇప్పటికే చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం పొందడానికి భద్రతా మండలి ఓటింగ్ ఒక్కటే మార్గం. అత్యధిక సభ్య దేశాలు పాలస్తీనాకు మద్దతిస్తున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) పరిశీలక హోదాను మాత్రమే కల్పించ గలదు. వీటో అధికారం కలిగి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యా, చైనాలు పాలస్తీనా గుర్తింపు ప్రయత్నానికి మద్దతిస్తు న్నాయి. పాలస్తీనియన్లను ఐక్యరాజ్య సమితిలోకి అనుమతించినట్లైతే మిగి లిన ప్రపం చమంతా దూరమై పోతుం దని ఇజ్రాయిలీలు అమెరికన్లు వాదిస్తు న్నారు. అయితే ఈ వాదనను మేం అంగీకరించడం లేదని చుర్కిన్ అన్నారు. నిజానికి పాలస్తీనియన్లకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే అది చర్చల క్రమాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా పాలస్తీనాను గుర్తించాలన్న విజ్ఞప్తిని పరిశీలించేందుకు ఐరాస భద్రతా మండలి ప్రత్యేక కమిటీ శుక్రవారం సమావేశమైంది.పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ గుర్తింపు కోరుతూ ఐక్యరాజ్య సమితికి విజ్ఞాపన అంద చేశారు. ఈ ఏకపక్ష చర్యను ఇజ్రాయిల్, అమెరికాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రయత్నం భవిష్యత్ శాంతి చర్చలను స్తంభింపచేస్తుందని వారి వాదన. తక్షణమే చర్చలకు తిరిగి రావాల్సిందిగా ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు పిలుపునిచ్చాయి.