న్యూఢిల్లీ : రైల్వేలో పనిచేస్తున్న నాన్ గజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త, త్వరలో 78 రోజుల వేతనాన్ని బోనస్గా పొందనున్నారు. దాదాపు 12.60 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సమాచార, ప్రసారల శాఖ మంత్రి అబికా సోనీ మాట్లాడుతూ రైల్వేలో పనిచేస్తున్న ఆర్హులైన ఉద్యోగస్తులకు 2010-11 సంవత్సరానికి గానూ 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో ముడిపడి వున్న బోనస్గా చెల్లించాలని రైల్వే శాఖ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైల్వేలో పనిచేస్తున్న 12.61 లక్షల మంది నాన్ గజిటెడ్ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారని అబికాసోని చెప్పారు. మంత్రివర్గం సమావేశం అనంతరం అబికాసోని విలేకరులతో మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి వున్న బోనస్గా రూ.1,098.58 కోట్లు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు.